గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (22:07 IST)

వెంకీకి చుక్కలు చూపిస్తున్న నయనతార... ఏంటి సంగతి..?

నయనతార కోసం ఇప్పుడు వెంకటేష్ సినిమా గ్యాప్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భలేభలే మగాడివోయ్‌ తర్వాత దర్శకుడు మారుతీ చేస్తున్న సినిమా 'బాబు బంగారం'. వెంకటేష్‌తో చేస్తున్నాడు. ఆయన సరసన నయనతార నటిస్తోంది. అయితే.. ఆమె తమిళ, మలయాళ చిత్రాల్లో బిజీగా వుండటంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనలేదు. 
 
ఆమె ఇచ్చిన డేట్స్‌ ప్రకారం.. ఈపాటికే హాజరు కావాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె రాలేకపోతున్నట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది. వెంకటేష్‌తో లక్ష్మీ, తులసి చిత్రాల్లో కలిసి నటించింది. గత నెలలో మారుతీ ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. ఎక్కువగా వెంకటేష్‌తో పాటు మిగిలిన తారాగణం పాల్గొన్న సన్నివేశాలు చిత్రించారు. 
 
ఇప్పటికి 20 రోజుల గ్యాప్‌ వచ్చింది. ఆమె వస్తేనే కానీ.. మిగిలిన పార్ట్‌ పూర్తికాదు. దర్శకుడు మారుతి మాత్రం.. కొంచెం టన్షన్‌లో వున్నట్లు తెలుస్తుంది. అంతకుముందు.. వెంకటేష్‌తో సినిమా చేయాలనుకుంటే.. అది వాయిదా పడింది. ఆ చిత్ర కథపై వివాదం కొనసాగింది. ప్రస్తుతం ఈ కథ వేరే అని తెలుస్తోంది.