ఖుషి 2లో నయనతార: తెలుగు వెర్షన్తో పవన్ కల్యాణ్?
పవన్ కల్యాణ్ నటించిన ఖుషి బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్-జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్కడా హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్లో విజయ్ హీరోగా నటించేందుకు రెడీ అవుతుండగా.. ఖుషి డైరక్టర్ ఎస్జే సూర్య దర్శకత్వ పగ్గాలు చేపట్టేందుకు సై అంటున్నాడు.
ఎ.ఎమ్. రత్నం నిర్మాణ సారథ్యం వహించే ఖుషి 2లో నయనతారను తీసుకోవాలని సంప్రదింపులు జరుగుతున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను రూపొందించాలని ఎస్జే సూర్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఖుషి స్టార్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్నే తీసుకోవాలనుకుంటున్నాడు. మరి పవన్ కల్యాణ్ ఎస్జే సూర్య ఖుషి 2లో నటిస్తాడో లేదో వేచి చూడాలి.