మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (16:10 IST)

గులాబి స్నేహం మళ్ళీ మొదలైంది.. హిట్ కొట్టేనా?

సినీకెరీర్‌ను ఒకేసారి ప్రారంభించి.. గులాబి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ, నటుడు జెడి చక్రవర్తి మంచి స్నేహితులు. వీరిద్దరి ఆ తర్వాత కలిసి నటించిన చిత్రాలు తక్కువే. ఎవరికెరీర్‌ వారు

సినీకెరీర్‌ను ఒకేసారి ప్రారంభించి.. గులాబి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ, నటుడు జెడి చక్రవర్తి మంచి స్నేహితులు. వీరిద్దరి ఆ తర్వాత కలిసి నటించిన చిత్రాలు తక్కువే. ఎవరికెరీర్‌ వారు చూసుకుంటుంటుండగా.. మరోసారి ఇద్దరి కాంబినేషన్‌ వచ్చింది. సందీప్‌ కిషణ్‌ నటిస్తున్న 'నక్షత్రం' కోసం జెడీని కృష్ణవంశీ పిలిపించినట్లు తెలిసింది. 
 
ఈసారి ఎలాగైనా భారీ విరాజయం అందుకోవాలని లక్ష్యంతో ఈ సినిమా కోసం అన్ని విధాల కష్టపడుతున్నాడు కష్ణవంశీ. ఇందులో కీలకమైన రోల్‌ను జేడీ చేత చేయిస్తున్నాడు. పోలీసుల జీవితాల మీద, వాళ్ళ సిన్సియారిటీ మీద రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌, రెజినాలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ప్రగ్యా జైస్వాల్‌, సాయి ధరమ్‌ తేజ్‌ అతిధి పాత్రల్లో కన్పిస్తున్నారు. మరి కృష్ణవంశీ ఎత్తులు పారతాయోలేదో చూడాలి.