నితిన్తో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బేనర్లో కె.కె.రాధామోహన్ భారీ చిత్రం
'ఏమైంది ఈవేళ', 'బెంగాల్ టైగర్' వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ మరో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. యూత్స్టార్ నితిన్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాక
'ఏమైంది ఈవేళ', 'బెంగాల్ టైగర్' వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ మరో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. యూత్స్టార్ నితిన్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ... ''నితిన్తో ఓ సూపర్హిట్ చిత్రం తియ్యాలన్న ఉద్దేశంతో సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం నితిన్... హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా, కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం ఆగస్టు తర్వాత మా చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు.