మహానటి సావిత్రి జీవిత గాథపై సినిమా.. సావిత్రి పాత్రలో నిత్యామీనన్..
అలనాటి సినీతార, మహానటి సావిత్రి జీవిత గాథ సినిమాగా రూపుదిద్దుకోనుంది. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అశ్వనీదత్ నిర్మాతగా వ
అలనాటి సినీతార, మహానటి సావిత్రి జీవిత గాథ సినిమాగా రూపుదిద్దుకోనుంది. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తారు. సావిత్రి జీవితంలో తెలియని కోణాల్ని సృశిస్తూ సాగే ఈ చిత్రంలో ఇంకొంతమంది స్టార్ హీరోలు అతిథి పాత్రలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
బయోపిక్లకు ఆదరణ పెరుగుతున్న ఈ కాలంలో… సావిత్రి జీవిత కథని ఎలా తెరకెక్కిస్తారో, ఆ చిత్రం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల పాటు సావిత్రి పాత్ర కోసం అరడజను హీరోయిన్ల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అనుష్క, విద్యాబాలన్, పరిణితీ చోప్రా ఇలా చాలామంది పేర్లు అనుకొన్నారు.
అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..? సావిత్రి పాత్ర కోసం చివరికి ఆ ఛాన్స్ నిత్యమీనన్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల నాగ్ అశ్విన్, అశ్వనీదత్ ఇద్దరూ నిత్యని కలసి కథ వినిపించడంతో ఆమె వెంటనే ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేసిందట.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే ఈ చిత్రాన్ని హిందీలో కూడా అనువదించాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇకపోతే, 2016 డిసెంబరులో సినిమా సెట్స్పైకి వస్తుందని, 2017 వేసవికి కానుకగా సినిమా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.