శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (16:27 IST)

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మెగా హీరోలు.. సమ్మర్‌లో ఫ్యాన్స్‌కు కనువిందే...

మెగా ఫ్యామిలీ హీరోలు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు. దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీకి ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆలరిస్తున్నాడు. చిరంజీవి కంటే

మెగా ఫ్యామిలీ హీరోలు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు. దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీకి ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆలరిస్తున్నాడు. చిరంజీవి కంటే ముందుగా ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ "ధృవ"తో ముందుకొచ్చి బంపర్ హిట్ కొట్టాడు. అయితే, వచ్చే సమ్మర్ సీజన్‌లోనూ మాదే హవా అంటున్నారు మెగా ఫ్యామిలీ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్‌లు. 
 
హీరో పవన్ నటించిన తాజా చిత్రం 'కాటమరాయుడు'. వచ్చే ఉగాది సందర్భంగా అంటే మార్చి 29వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన "డీజే దువ్వాడ జగన్నాథం" మే నెలలో విడుదల కానుంది. తన కెరీర్‌లో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుని రోల్ ఇందులో పోషించడం విశేషం. 
 
ఇక సాయి ధరం తేజ్ చిత్రం 'విన్నర్' చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది వచ్చే నెలలో విడుదల కానుంది. వరుణ్ తేజ్ సినిమా "మిస్టర్" మూవీ కూడా వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్‌కు సిద్ధమైన విషయం తెల్సిందే. ఇలా మెగా హీరోలంతా ఈ వేసవిలో తమ ఫ్యాన్స్‌కు కనువిందు చేయబోతున్నారు.