గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (14:41 IST)

నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ సాంగ్: పాటని సిద్ధం చేసే పనిలో దేవీశ్రీ ప్రసాద్!

ఎన్‌.టి.ఆర్‌ నటిస్తున్న 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో' షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్ర టీం ఫైనల్‌ షెడ్యూల్‌ కోసం స్పెయిన్‌ వెళ్లనున్నారు. కాగా, ఎన్‌.టి.ఆర్‌ నటుడిగానే కాకుండా తనకున్న మక్కువతో ఇప్పటికే తన సినిమాలలో ఓ నాలుగు పాటలు పాడాడు. యమదొంగలో 'ఓలమ్మి తిక్కరేగిందా', కంత్రిలో '123 నేనొక కంత్రి', అదుర్స్‌లో 'చారి', రభసలో 'రాకాసి రాకాసి' పాటలను పాడాడు. ఈ నాలుగు సాంగ్స్‌ అప్పట్లో చార్ట్‌ బస్టర్స్‌గా నిలిచాయి.
 
ఇదే కోవలోనే ఎన్‌.టి.ఆర్‌ నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా ఓ పాటని పాడటానికి సిద్దమయ్యాడు. ఇటీవలే దేవీశ్రీ ప్రసాద్‌ ఎన్‌.టి.ఆర్‌‌ని కలిసి ఓ పాట ఆయన పాడితే బాగుంటుందని అప్రోచ్‌ అయితే ఎన్‌.టి.ఆర్‌ కూడా దానికి సుముఖత చూపినట్లు సమాచారం. దాంతో దేవీశ్రీ ప్రసాద్‌ ఫుల్‌ ట్యూన్‌, పాటని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఆ పాట రెడీ అయ్యాక ఎన్‌.టి.ఆర్‌ ఆ పాటని పాడనున్నారు.
 
ఎన్‌.టి.ఆర్‌ తన 25వ సినిమా ద్వారా మరోసారి సింగర్‌గా కూడా అభిమానులను మెప్పించనున్నాడు. సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. డిసెంబర్‌ 3వ వారం కల్లా సినిమా షూటింగ్‌ పూర్తిచేసి సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్‌ చేయనున్నారు.