గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (12:07 IST)

'స్వామి వారి తొలి దర్శనం'.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఏం చెప్పబోతున్నారు?

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అత్యంత భక్తిశ్రద్ధలతో నటిస్తున్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జునతో పాటు.. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమ

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అత్యంత భక్తిశ్రద్ధలతో నటిస్తున్న చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జునతో పాటు.. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.
 
అయితే, హథీరాంబాబా జీవిత నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతుండగా మరో రెండు రోజుల్లో స్వామి వారి తొలి దర్శనం అంటూ ఓ పోస్టర్‌ని గురువారం రాఘవేంద్ర రావు విడుదల చేశారు. స్వామి వారి తొలి దర్శనం అంటే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా? లేదంటే వెంకటేశ్వర స్వామిగా నటిస్తున్న నటుడి లుక్‌ని రివీల్ చేస్తారా అనేది అపుడు తెలియాల్సి వుంది. 
 
జూలై 2న అన్న పూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక ఆలయం సెట్టింగ్‌లో ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ఆరంభమైంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 'అన్నమయ్య', 'శ్రీ రామదాసు', 'షిరిడా సాయి' తర్వాత నాగార్జున - రాఘవేంద్రరావు కాంబినేషనల్‌లో వస్తోన్న మరో భక్తి రస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' అభిమానులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.