బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:57 IST)

"ఓం నమో వేంకటేశాయ" కోసం గడ్డం పెంచి.. భక్తి శ్రద్ధలతో నటించారు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్

అన్నమయ్య, రామదాసు వంటి భక్తిరస చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఇదే కోవలోనే "ఓం నమో వేంకటేశాయ" చిత్రంలో నటిస్తున్నారు. అన్నమయ్య తన సంకీర్తనలతో శ్రీవారిని

అన్నమయ్య, రామదాసు వంటి భక్తిరస చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఇదే కోవలోనే "ఓం నమో వేంకటేశాయ"  చిత్రంలో నటిస్తున్నారు. అన్నమయ్య తన సంకీర్తనలతో శ్రీవారిని ప్రసన్నుడిని చేసుకుంటే, రామదాసు తన భక్తి ప్రపత్తులతో దైవాన్ని తన వాడుగా చేసుకున్నాడు. తాజాగా హథీరామ్ బాబా కూడా శ్రీ వేంకటేశ్వర స్వామిని తన స్నేహంతో కట్టివేస్తాడు. ఈ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. 
 
ఈ సినిమా గురించి నిర్మాత మహేశ్ రెడ్డి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలిపారు. శిరిడీ సాయిబాబా మా గురువైతే, ఏడు కొండల వేంకటేశ్వరస్వామి మా కులదైవం. మా గురువుగారి కథతో 'శిరిడిసాయి' తీశా. ఇప్పుడు ఓ భక్తుడిగా మా వెంకన్నకి మహాభక్తుడైన హథీరామ్‌ బాబా చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించానని చెప్పుకొచ్చారు. తనకు భక్తిరస చిత్రాలను తెరకెక్కించేందుకు సాయపడిన రాఘవేంద్ర రావు, నాగార్జున గారికి రుణపడి ఉంటానని మహేష్ రెడ్డి తెలిపారు. 'శిరిడి సాయి' తర్వాత నాగార్జున,కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో మహేష్ రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' ఈ నెల 10న రిలీజవుతోంది. 
 
శ్రీవారి సేవల గురించి.. పూజల గురించి వాటి విశిష్ఠత గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశామన్నారు. 'ఓం నమో వేంకటేశాయ' అనేది ఎన్నిసార్లు పలికితే అంత మంచి జరుగుతుంది. అందుకే, హాథీరామ్‌ బాబా చరిత్రకి ఆ పేరు పెట్టడం జరిగిందని మహేష్ రెడ్డి వెల్లడించారు. కమర్షియల్ చిత్రాలు చేస్తూ భక్తిరస చిత్రాల్లో నటించే నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం మా అదృష్టమని.. భక్తి శ్రద్ధలతో గడ్డం పెంచి నాగార్జున ఈ  సినిమాలో నటించారని చెప్పారు. తెరపై నాగార్జునను చూడగానే భక్తి భావంతో తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయని నిర్మాత చెప్పుకొచ్చారు. 
 
ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాఘవేంద్ర రావు, సౌరభ్, నాగార్జున, విమలా రామన్, ప్రగ్యా జైశ్వాల్, అనుష్క తదితరులు నటించిన ఈ చిత్రం తప్పకుండా ఆయా పాత్రధారులకు మంచి గుర్తింపు సంపాదించిపెడుతుందని నిర్మాత వెల్లడించారు.