శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (18:22 IST)

వ్యభిచారిగా మారనున్న పాయల్ రాజ్‌పుత్

"ఆర్ఎక్స్ 100" చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో తన అందాలను ఆరబోయడమేకాకుండా, నెగెటివ్ పాత్రలో నటించి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ఆమెకు అదే తరహా పాత్రలు వస్తున్నాయి. అవకాశాలు వస్తున్నాయని కదాని ఆమె అంగీకరించడం లేదు. అచితూచి అడుగులు వేస్తోంది. ఇపుడు ఓ చిత్రంలో నటించేందుకు సమ్మతించింది. అయితే, ఇందులో ఆమె పాత్ర వేశ్య. 
 
ఈ చిత్రాని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి భానుశంకర్ దర్శకత్వం వహించనున్నారు. 1970-80 కాలంలో రాబిన్ హుడ్‌గా పేరుపొందిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే చిత్రంలో పాయల్ నటించనుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినప్పటికీ.. రెండో కథనాయికగా పాయల్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో ఈమె పాత్ర వేశ్య అని, పాత్ర కూడా చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పడంతో ఆమె అంగీరించారు.