సరైన వ్యక్తి దొరికితే డేటింగ్ చేసేందుకు అభ్యంతరం లేదు : పూజా హెగ్డే
'గోపికమ్మా చాలును లేమ్మా' అంటూ తెలుగువారిని 'ముకుంద' సినిమాతో మురిపించి మెప్పించిన హీరోయిన్ పూజా హెగ్డే. కోలీవుడ్లో కెరీర్ మొదలెట్టి టాలీవుడ్లో వెంట వెంటనే రెండు సినిమాలు చేసేసి అంతే స్పీడులో బాలీవ
'గోపికమ్మా చాలును లేమ్మా' అంటూ తెలుగువారిని 'ముకుంద' సినిమాతో మురిపించి మెప్పించిన హీరోయిన్ పూజా హెగ్డే. కోలీవుడ్లో కెరీర్ మొదలెట్టి టాలీవుడ్లో వెంట వెంటనే రెండు సినిమాలు చేసేసి అంతే స్పీడులో బాలీవుడ్కి ఎగిరిపోయింది ఈ సన్నజాజి సుందరి. బాలీవుడ్లో తొలి ప్రయత్నంలోనే ఓ పెద్ద స్టార్తో ఓ భారీ చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం తెలుగులో మంచి అవకాశాలను కూడా వద్దనుకుంది.
'మొహెంజోదారో' చిత్రంలో నటించేందుకు అనేక చిత్రాలు వదులుకున్నారు. దీనికి కారణం డేట్లు కుదరకనే. కానీ, తెలుగులో చేయనని ఎప్పుడూ చెప్పలేదు. హీరోయిన్గా నాకు గుర్తింపు వచ్చింది టాలీవుడ్ ద్వారానే. తెలుగు లోనే కాదు, దక్షిణాదిన ఏ భాషలో అవకాశం వచ్చినా వదులుకోను.
ఇకపోతే.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో ప్రేమలో పడ్డారని అంటారు నిజమేనా? అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. దీనికి గతంలోనే సమాధానం చెప్పాను. బాలీవుడ్లోనే కాదు, ఇతర భాషల హీరోలతో ఎవరితోనూ ప్రేమలో పడలేదు. ప్రేమకువ్యతిరేకిని కాను. సరైన వ్యక్తి దొరికితే అతన్ని ప్రేమించడానికీ, అతనితో డేటింగ్ చేయడానికీ నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇంతవరకూ నాకు అలాంటి వ్యక్తి తారసపడలేదు. దానికి ఇంకా సమయముంది.