జూలై 18న 'శ్రీమంతుడు' ఆడియో విడుదల.. తేదీ ఖరారు..
ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు' ఆడియో విడుదలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 18వ తేదిన ఈ వేడుకను నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని ఆగస్టు ఏడో తేదిన విడుదల చేయదలచారు. ప్రస్తుతం చిత్ర పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో వేడుకను నిర్వహించేందుకుగాను మాదాపూర్లోని శిల్పకళా వేదిక ఆడిటోరియంను బుక్ చేశారు. ఆ రోజు కార్యక్రమాన్ని విభిన్నమైన వేడుకలా నిర్వహించడానికి చిత్ర నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.