శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (12:49 IST)

పాండవులకు ఆశ్రయం కల్పించిన ఈ దండకారణ్యం: నారాయణ మూర్తి

స్నేహా చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్ రెడ్డి, త్రినాద్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మర్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ''త్రేతాయుగంలో సీతారాములను, ద్వాపరయుగంలో పాండవులకు ఆశ్రయం కల్పించిన ఈ దండకారణ్యం కలియుగంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. 
 
ప్రభుత్వం చేపట్టే గనులు, బాక్సైట్ తవ్వకాల వలన ఆదీవాసీయుల మనుగడ లేకుండా పోతుంది. పర్యావరణమంతా.. సర్వనాశనం అయిపోతుంది. రాజ్యాంగంలో ఆదీవాసీయుల హక్కులను ఉల్లంగించి ప్రభుత్వం ఈ పనులను చేపడుతుంది. వారి హక్కుల కోసం చర్చించే చిత్రమే ఈ దండకారణ్యం. మూల వనరులు మూలవాసీయులకే చెందాలి. విదేశీపాలు కాకూడదు. ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి. 
 
గద్దర్ మూడు పాటలను పాడారు. వందేమాతరం శ్రీనివాస్ నాలుగు పాటలను రాశారు. గోరటి వెంకన్న, కాశిపతి, ములుగు తిరుపతి వంటి ప్రజాకవులు ఈ సినిమాకు సాహిత్యం అందించారు. ఈ సినిమాలో ఉద్యమకారుడు కోటన్న పాత్రలో నటించాను. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ నెల 20న పాటలను విడుదల చేసి, మార్చి 4న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
 
ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఆపరేటివ్ కెమెరామెన్: నాగేష్ బాబు, కథ,చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కోరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.