శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 4 ఆగస్టు 2015 (11:49 IST)

రాఘవ లారెన్స్ కోటి రూపాయల సాయం... కలాం పేరిట పేదలకు...

నిస్వార్థపరుడు, దేశం కోసం అహర్నిశలు కృషి చేసిన భారతరత్న అబ్దుల్ కలాం మరణించినప్పటికీ ఆయన స్ఫూర్తితో పలువురు పలు కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా కోలీవుడ్, టాలీవుడ్ దర్శకుడు రాఘవ లారెన్స్ భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరిట పేదలకు కోటి రూపాయలను సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కలాం పేరిట ప్రత్యేకంగా పురస్కారాలను కూడా అందిస్తానని చెప్పుకొచ్చారు.
 
తను నటిస్తూ దర్శకత్వం వహించనున్న రెండు చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో ఒకటైన ‘మొట్టశివ కెట్టశివ’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన వేందర్ మూవీస్ నుంచి లారెన్స్ రూ.కోటి చెక్కును అందుకున్న వెంటనే ఆ మొత్తాన్ని కలాం పేరిట పేదలకు సాయంగా ఇవ్వనున్నట్లు ప్రకటించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. లారెన్స్ బాటలో మరికొందరు కూడా నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.