బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 2 మార్చి 2017 (08:38 IST)

రాజమౌళి జన్మ ధన్యం: ‘బాహుబలి-2’ తొలి ప్రేక్షకురాలు క్వీన్ ఎలిజబెత్ -2

ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అనడం అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఓ తెలుగువాడు ఇంతటి ఘనత సాధించడం ప్రశంసనీయం.

ఏ నోట విన్నా ‘బాహుబలి-2’ మాటలే. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి అనడం అతిశయోక్తి కాదు. చివరికి ప్రధాన మంత్రి, బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కూడా దీనికోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఓ తెలుగువాడు ఇంతటి ఘనత సాధించడం ప్రశంసనీయం.

 
ఎస్ఎస్ రాజమౌళి ‘బాహుబలి - ది కంక్లూజన్’ పట్ల సినీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఏప్రిల్ 28 ఎంత తొందరగా వస్తుందా... అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో సినిమాలను ఆదరించే కళాభిమానులంతా ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ నటించిన ‘బాహుబలి’ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే వీరందరిలో ఈ సినిమాను మొట్టమొదట చూసేది ఎవరో తెలిస్తే ఆశ్చర్యంతో పాటు తెలుగువాళ్ళంతా, ఆ మాటకొస్తే భారతీయులంతా గర్వపడవచ్చు. ఈ సినిమాకు మొదటి ప్రేక్షకురాలు బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 అని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు.
 
బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏప్రిల్ 24 నుంచి నిర్వహిస్తున్న ‘ఇండియా ఆన్ ఫిల్మ్స్’ కార్యక్రమంలో ‘బాహుబలి - ది కంక్లూజన్‌’ను ప్రదర్శిస్తారని సమాచారం. ఈ సినిమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి క్వీన్ ఎలిజబెత్ -2 చూస్తారని తెలుస్తోంది.
 
హైదరాబాద్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘బాహుబలి 2’ చిత్రం ప్రీమియర్‌ షోను ముందుగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 వీక్షించనున్నారట. స్వతంత్ర భారతదేశం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌ 24న బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘ఇండియా ఆన్‌ ఫిల్మ్‌’ కార్యక్రమంలో పలు భారత సినిమాలను ప్రదర్శించనుంది. ఇందులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ షోకు క్వీన్‌ ఎలిజబెత్‌-2, ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 
2015లో విడుదలైన ‘బాహుబలి ది బిగినింగ్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును పొందింది. దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.