'రాక్షసి'గా చిత్రంలో రాక్షసిగా కాదు.. తల్లిగా కన్పిస్తా: నటి పూర్ణ
పూర్ణ, అభినవ్ సర్ధార్, అభిమన్యుసింగ్, గీతాంజలి ప్రధాన తారాగణంగా డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పన్నా రాయల్ దర్శకత్వంలో అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ నిర్మిస్తున్న ఈ చిత్రం 'రాక్
పూర్ణ, అభినవ్ సర్ధార్, అభిమన్యుసింగ్, గీతాంజలి ప్రధాన తారాగణంగా డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పన్నా రాయల్ దర్శకత్వంలో అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ నిర్మిస్తున్న ఈ చిత్రం 'రాక్షసి'. ఈ సినిమా మోషన్ పోస్టర్ను లగడపాటి శ్రీధర్, టైటిల్ లోగోను రాజ్ కందుకూరి, పోస్టర్ను కె.సురేష్బాబు విడుదల చేశారు.
అనంతరం పూర్ణ మాట్లాడుతూ... ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించాలని దర్శకుడు పన్నా రాయల్ చెప్పగానే ముందుగా ఆలోచించాను. అయితే స్క్రిప్ట్ వినగానే సినిమా చేయడానికి అంగీకరించా. రాక్షసి సినిమాలో నేను రాక్షసి పాత్రలో కనపడను. తల్లి పాత్రలో చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఖచ్చితంగా నా కెరీర్లో ఈ సినిమా మరో హిట్ మూవీ అవుతుంది. వినోద్ యాజమాన్య సంగీతం, కర్ణ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద హైలెట్ అంశాలుగా నిలుస్తాయని అన్నారు.
దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ.. 'కాలింగ్ బెల్' సినిమా సమయంలోనే రెండోది చేయాలనుకున్నాను. అయితే సీక్వెల్ చేసే సమయంలో టైటిల్ను 'రాక్షసి' అని నిర్ణయించాం. నిర్మాతల సహకారంతోనే సినిమాను మంచి విలువలతో చేయగలిగాను. సినిమా మంచి టెక్నికల్ ఎలిమెంట్స్తో అందరికీ నచ్చేలా ఉంటుదని అన్నారు.