చెర్రీతో రకుల్ సెల్ఫీ... ట్వీట్స్ అదుర్స్..
ఇటీవల సెల్ఫీలు తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే వారి సంఖ్య బాగానే పెరిగింది. ఇదే సినీ స్టార్స్ అయితే వారి సినిమాలకు పైసా ఖర్చు లేకుండా ప్రమోషన్ వర్క్ జరిగిపోతుంది. తాజాగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ యంగ్ హీరో రాంచరణ్తో సెల్ఫీ తీసుకుని, దానిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రాంచరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో హీరోయిన్గా రకుల్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతోంది. హీరోహీరోయిన్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంలోనే చరణ్ బైక్పై కూర్చున్న రకుల్ .. ఆయనతో సెల్ఫీ తీయించుకుంది. అభిమానులకి ఈ సెల్ఫీ ఆనందాన్ని కలిగించడం ఖాయం.