మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 1 జులై 2016 (19:12 IST)

కాశ్మీర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన రామ్‌ చ‌ర‌ణ్‌

రామ్‌ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ‌`. ఈ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. కాప్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ 10 రోజుల పాటు టాకీతో పాటు, ఓ సాంగ్‌ని చిత్రీక‌రించారు. కాశ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చ‌ర‌ణ్ నేటి (గురువారం) సాయంత్రం  హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు. 
 
`ధృవ‌` ఫ‌స్ట్‌లుక్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అయితే ఈలోగానే క‌శ్మీర్ ఆన్‌లొకేష‌న్ స్టిల్ ఒక‌టి అంత‌ర్జాలంలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ స్టిల్‌లో చ‌ర‌ణ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్‌లో, జ‌నాల్లో టాక్ వ‌చ్చింది. చ‌ర‌ణ్ మునుప‌టి కంటే స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడంటూ ప్ర‌శంస‌లొచ్చాయి. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా మాతృక `త‌ని ఒరువ‌న్‌`లో విల‌న్‌గా న‌టించిన అర‌వింద్ స్వామి ఈ చిత్రంలోనూ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ర‌కూల్ ప్రీత్‌సింగ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ధృవ చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. చ‌క్క‌ని స్టోరీ, గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లేతో  తెర‌కెక్కుతోందని చిత్ర‌ యూనిట్ చెబుతోంది.