శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (17:33 IST)

నిజాలు చెపుతుంటే పాత్రలో లీనమై నిజంగానే ఏడ్చేశా : రమ్యకృష్ణ

'బాహుబలి 2' చిత్ర విజయంపై సినీ నటి రమ్యకృష్ణ మరోమారు స్పందించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో శివగామి, కట్టప్ప, భల్లాలదేవ, బాహుబలి పాత్రల నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో శివగామి పాత్

'బాహుబలి 2' చిత్ర విజయంపై సినీ నటి రమ్యకృష్ణ మరోమారు స్పందించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో శివగామి, కట్టప్ప, భల్లాలదేవ, బాహుబలి పాత్రల నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో శివగామి పాత్రధారి రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘బాహుబలి-2’లో తనను కన్నీరు పెట్టించిన సన్నివేశం ఒకటి ఉందన్నారు. 
 
ఈ చిత్రాన్ని తొలిసారి హైదరాబాద్‌లో చూశానని చెప్పింది. ఈ సినిమాలో శివగామి ముందుకు వచ్చి కట్టప్ప పచ్చి నిజాలు చెప్పే సన్నివేశం వచ్చినప్పుడు ఏడ్చేశానని, ఈ సన్నివేశం ఎంతో భావోద్వేగంతో నిండి ఉంటుందని, ఆ సన్నివేశంలో నటించడం తనకు చాలా నచ్చిందని చెప్పింది. నిజంగా ఈ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించడం పడిన కష్టానికి దక్కిన ఫలితమని తెలిపింది. 
 
ఇకపోతే 'బాహుబలి-2' సినిమా సిగలో ఎన్నో అరుదైన రికార్డులు వచ్చి చేరుతున్నాయి. తాజాగా మరో రికార్డు 'బాహుబలి-2' ప్రతిష్టను మరింత పెంచుతోంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన 'బాహుబలి-2'... ఇప్పుడు తాజాగా 1200 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హిందీ వెర్షన్‌లోనే 360 కోట్ల రూపాయలు వసూలు చేసిన 'బాహుబలి-2', అమెరికాలో 100 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా చరిత్రకెక్కింది.