అన్ని ప్రేమకథలూ సుఖాంతం కావు.. నాదీ అంతే.. నయన లవ్పై ప్రభుదేవా కామెంట్స్
ప్రభుదేవా-నయనతార ప్రేమ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వీరు పెళ్లి ఏర్పాట్ల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి విబేధాలు రావడంతో విడిపోయా
ప్రభుదేవా-నయనతార ప్రేమ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వీరు పెళ్లి ఏర్పాట్ల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి విబేధాలు రావడంతో విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే వీరు విడిపోయిన పరిణామాలు మాత్రం ఆవేశపూరితంగా జరిగినవే అని చెప్పక తప్పదు. కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన 'విల్లు' చిత్రం సందర్భంగా నయనతార-ప్రభుదేవా మధ్య ప్రేమ చిగురించింది. శింబుతో బ్రేకప్ అయిన తర్వాత అప్పుడప్పుడే మానసికంగా కోలుకున్న నయనతార ప్రభుదేవా వైపు ఆకర్షితురాలైంది. అయితే అప్పటికే ప్రభుదేవాకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో వీరి ప్రేమ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. అనేక వివాదాల అనంతరం ప్రభుదేవా తన భార్యకు విడాకులిచ్చారు. నయనతార తన సినిమా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి సినిమాలకు శాశ్వతంగా దూరం కావాలని నిర్ణయించుకుంది. క్రిస్టియన్ అయిన నయన, ప్రభుదేవా కోసం మతం కూడా మార్చుకోవాలని భావించింది. వ్యవహారం ఇంతవరకు వచ్చిన తర్వాత వీరు విడిపోవడం అభిమానులను షాక్కు గురిచేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా మాటల్లేవు. ప్రభుదేవా గురించి నయనతార ఎప్పుడూ నోరు విప్పదు.
ప్రభుదేవా మాత్రం ఇప్పుడు తొలిసారి నయనతారతో బ్రేకప్ గురించి పెదవి విప్పాడు. ''ప్రేమ అంటే నాకిప్పటికీ గౌరవం ఉంది. అయితే అన్ని ప్రేమకథలూ సుఖాంతం కావు. నాదీ అంతే. ప్రేమలో పడడం, అందులో విఫలం అవ్వడం కూడా ప్రేమలో ఒక భాగంగానే చూస్తాను. అయ్యిందేదో అయ్యింది. దాని గురించి నేనేం చింతించడం లేదు. నిజానికి అంత టైమ్ కూడా లేదు. నా పర్సనల్ లైఫ్ నాకుంది. దాంతో నేను హ్యాపీగా ఉన్నాను'' అంటున్నాడు ప్రభుదేవా.
అంతేకాదు.. సృష్టిలో అందరికీ ఏదో ఓ రూపంలో బాధలు వెంటాడుతుంటాయని, సంపూర్ణ ఆనందంతో ఉన్న వ్యక్తి ఎవ్వరూ ఉండరని, అలాంటి వ్యక్తి ఎదురైతే.. తప్పకుండా అతనికి సలాం కొట్టి, సహాయకుడిగా మారిపోతానని అంటున్నాడు ప్రభుదేవా. అయితే ఇద్దరూ ఎందుకు విడిపోయారో, అసలు కారణం ఏమిటన్నది ప్రభుదేవా చెప్పడం లేదు.