శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 16 ఏప్రియల్ 2018 (21:45 IST)

'భ‌ర‌త్ అనే నేను' ఫంక్ష‌న్‌కి తార‌క్‌ని పిల‌వ‌డం వెనక ఏం జ‌రిగింది..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ సెన్సేష‌న్ భ‌ర‌త్ అనే నేను. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన‌ ఆడియోను హైద‌రాబాదులో భారీ స్ధ

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ సెన్సేష‌న్ భ‌ర‌త్ అనే నేను. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన‌ ఆడియోను హైద‌రాబాదులో భారీ స్ధాయిలో ఘ‌నంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌డం విశేషం. 
 
అస‌లు ఆడియో ఫంక్ష‌న్‌కి ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది అని కొర‌టాల శివ‌ని అడిగితే అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.... ఫంక్షన్ హైదరాబాదులో చేయాలని అనుకున్న తరువాత, సంవత్సరం మొత్తం మన ఫేస్‌లే చూసుకున్నాం. సినిమా ఫంక్షన్‌కు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది కదా?" అని మహేష్ అన్నార‌ట‌. 
 
ఎవరిని పిలవాలని ఆలోచిస్తున్న సమయంలో ఆయనే తారక్‌ను పిలుద్దామా? అని అడిగారట‌. వెంటనే కొర‌టాల‌ ఫంక్షన్ గురించి చెప్పి, తారక్‌ను ఆహ్వానిస్తే, ఊరుకోండి... జోక్ చేస్తున్నారా? అని అన్నాడట‌. జోక్ కాదు.. నిజంగా రావాలని కోరితే, అంగీకరించి, రెండు గంటల పాటు తాను కూడా ఎంజాయ్ చేస్తానని చెప్పాడట‌. ఎన్టీఆర్ రావడం తమ ఫంక్షన్‌కు ప్లస్ పాయింట్ అయిందని చెబుతూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు కొర‌టాల‌.