బాలీవుడ్కు సమంత... సక్సెస్ కొడుతుందా?!
టాలీవుడ్, కోలీవుడ్లలో క్రేజీ హీరోయిన్గా వెలుగుతున్న బ్యూటీ సమంత. ఇన్నాళ్లు దక్షిణాదిలో చక్రం తిప్పిన ఈ చిన్నది బాలీవుడ్ తన సత్తాను పరిక్షించుకోనుంది. ప్రస్తుతం సమంత తమిళంలో హీరో ధనుష్ సరసన వీఐపీ -2 చిత్రంలో నటిస్తోంది. ధనుష్కి బాలీవుడ్లోనూ క్రేజ్ ఉండడంతో ఈ చిత్రాన్ని అనువదించి బాలీవుడ్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా సమంత బాలీవుడ్కు పరిచయం కాబోతుంది.
ఇప్పటికే దక్షిణాది నుంచి బాలీవుడ్కు వెళ్లిన త్రిష, తమన్నా లాంటి అందాల భామలు సైతం గోడకు కొట్టిన బంతుళ్లా తిరిగొచ్చారు. అందుకే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా వెలిగే బ్యూటీలు బాలీవుడ్లో అడుగు పెట్టాలంటే భయపడుతుంటారు. మరి ఈ స్థితిలో బాలీవుడ్కు వెళుతున్న సమంత సక్సెస్ కొడుతుందో లేదో వేచి చూడాలి.