శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 జూన్ 2017 (11:30 IST)

రారండోయ్ రూ.35కోట్ల రికార్డు.. సమంత ఇక హీరోయిన్‌గా వెండితెరపై కనిపించదా?

అక్కినేని నాగ చైతన్య నటించిన సినిమాల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా రికార్డు సాధించింది. ఈ సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ర

అక్కినేని నాగ చైతన్య నటించిన సినిమాల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా రికార్డు సాధించింది.  ఈ సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లు రాబట్టింది. నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. 
 
ఈ నేపథ్యంలో చైతూ మనువాడనున్న హీరోయిన్‌ సమంత ఇకపై వెండితెరపై కథానాయికగా కనిపించబోదని టాక్ వస్తోంది. గ్లామర్ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న సమంత త్వ‌ర‌లో నాగచైతన్యను పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి తర్వాత సమంత హీరోయిన్‌గా చేస్తుందా, చేయదా? అసలు సినిమాలకే గుడ్ బై చెబుతుందా? అన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు రీజన్ కూడా ఉంది. సమ్మూ పెళ్లికి కొన్ని నెలలకు ముందే సినిమాలను బాగా తగ్గించుకుంది. ఉన్న సినిమాలు కంప్లీట్ చేసుకుంటుంది. జనతాగ్యారేజ్ తర్వాత శామ్ చాలా గ్యాప్ తీసుకుంది. 
 
తాజాగా చెర్రీతో చేసే మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తున్న సామ్ మ‌హా న‌టి, రాజు గారి గ‌ది2 వంటి సినిమాల‌లో కీలక పాత్రల్లో కనిపించనుంది. నాగశౌర్య చేయబోయే కొత్త‌ మూవీలోను సమంత స్పెషల్ రోల్ చేస్తోందని వార్తల్లొచ్చాయి. వీటిని బట్టి చూస్తే సమంత ఇకపై హీరోయిన్‌గా తెరపై కనిపించదని, స్పెషల్ రోల్స్‌కే పరిమితం అవుతుందని సినీ పండితులు అంటున్నారు.