నైజాం ఏరియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'సరైనోడు'
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం ''సరైనోడు''. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి విడుదలైన తొలిరోజు మామూలు వసూళ్లను సాధించినప్పటికి... రెండో రోజు నుంచి ఊహించని విధంగా వసూళ్లను రాబట్టి రికార్డు బద్దలు కొడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కంటే నైజాంలోనే మాస్ మూవీలకన్నా క్లాస్ చిత్రాలు బాగా వసూళ్లను రాబడుతుందని అందరికి తెలిసిందే.
ముఖ్యంగా నైజాంలో ''సరైనోడు'' 6 రోజుల్లోనే రూ.10.55 కోట్ల వసూళ్లు సాధించింది. మరో వారంలో భారీ చిత్రాల నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో ఈ సినిమా మరో రూ.7-8 కోట్ల కలెక్షన్స్ రాబట్టవచ్చునని ట్రేడ్ వర్గాల అంచనా. ''సరైనోడు''కు మొదట నెగెటివ్ టాక్ రావడంతో నిరాశచెందిన అల్లు అర్జున్ ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ''సరైనోడు'' విషయంలో ఈ ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. అయితే ఓవర్సీస్, కర్ణాటక ఏరియాల్లో తన సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడమే బన్నీకి బాధ కలిగిస్తోంది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ''సరైనోడు'' మూవీ మెలమెల్లిగా ఊపందుకుంటోంది.