శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2015 (16:48 IST)

ట్రూలీ మ్యాడ్లీ యాడ్‌లో శ్వేతాబసు: 3 రోజుల్లోనే 5.83 లక్షల క్లిక్స్!!

టాలీవుడ్‌లో కొత్త బంగారు లోకంతో తెరంగేట్రం చేసిన శ్వేతాబసు ప్రసాద్, సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుని జైలుపాలైనా కోర్టు నిర్దోషిగా తీర్పు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు శ్వేతాబసు ప్రసాద్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెకు మంచి అవకాశాలు రావట్లేదు. అయితే కొత్త బంగారు లోకం సినిమా కంటే ముందు చైల్డ్ ఆర్టిస్టుగా అవార్డు దక్కించుకున్న శ్వేతాబసు ప్రస్తుతం సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి.. కమర్షియల్‌ యాడ్స్‌లో నటించేందుకు రెడీ అయ్యింది. 
 
తాజాగా ట్రూలీ మ్యాడ్లీ అనే యాప్ కోసం రూపొందించిన యాడ్‌లో క్రీపీ కవ్వాళి ఆడే అమ్మాయి యాక్ట్ చేసింది శ్వేతా బసు. ఈ పాటలో శ్వేతాబసు నటించిన కాస్ట్యూమ్స్ నుంచి ఎక్స్‌ప్రెషన్స్ వరకూ అన్నింటికీ మంచి స్పందన వస్తోంది. ఈ యాడ్‌కు యూట్యూబ్‌లో విడుదల చేసిన 3 రోజుల్లోనే 5.83 లక్షల క్లిక్స్ వచ్చాయంటే అమ్మడుకు ఎంతో క్రేజ్ వుందో అర్థం చేసుకోవచ్చు. సింగర్స్ అయిన అదితిపాల్ మన్సీ ముల్తానీ కూడా ఈ వీడియోలో దర్శనమిస్తుండగా... డైరెక్టర్ బాధ్యతలను అధిరాజ్ బోస్ నిర్వహించారు. యాడ్‌కే ఇంత రెస్పాన్స్ వస్తే ఇక సినీ ఛాన్సులొస్తే తప్పకుండా కలెక్షన్ల వర్షం కురపిస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.