'సైజ్ జీరో' లక్కీ విన్నర్కు అనుష్క కేజీ బంగారం గిఫ్ట్....
తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 27న విడుదల కాబోతున్న చిత్రం 'సైజ్ జీరో'. అనుష్క, ఆర్య జంటగా నటించిన ఈ సినిమాలోని లావు పాత్ర కోసం అనుష్క 20 కేజీల బరువు పెరిగి ఎంతో రిస్క్ తీస్కొని ఈ సినిమా చేసింది. ఈ చిత్రం కోసం చిత్ర నిర్మాత పీవీపీ ప్రసాద్ కొత్త కాన్సెప్ట్ను ఏర్పాటు చేశాడు. ఈ సినిమా చూసిన ఆడియన్స్కి 1కేజీ బంగారం గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సినిమా టికెట్తో పాటు మీకు ఓ పివిపి వోచర్ ఇస్తారు.
ఆ వోచర్ పైన ఉన్న 11 అంకెల కూపన్ కోడ్ని 95454 66666 కి ఎస్ఎంఎస్ చేయండి లేదా 'డబ్ల్యుడబ్బుపీవీపీసినిమా' లో రిజిష్టర్ అవ్వండి. అలా రిజిష్టర్ చేసుకున్న వారి నుంచి మూడు వారల తర్వాత 20 మంది లక్కీ విన్నర్స్ని సెలక్ట్ చేస్తారు. ఆ 20 మందిని అనుష్కను కలుసుకుని ఆ తర్వాత ఆ 20 మందిలో ఒకరిని లక్కీ డ్రా ద్వారా విన్నర్గా సెలక్ట్ చేసి వారికి 1 కేజీ బంగారాన్ని అందజేస్తారు. పైరసీని అరికట్టడం కోసమే ఇలా సరికొత్త రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నామని నిర్మాత పివిపి తెలిపాడు. అలాగే ఫ్యామిలీతో కలిసి వచ్చి చూడాల్సిన సినిమా అని చెప్పారు.