అనుష్క వర్సెస్ అనుష్క, 'సైజ్ జీరో' వర్సెస్ 'రుద్రమదేవి'... గెలిచేదెవరు?
సైజ్ జీరో చిత్రం అక్టోబరు 9 విడుదల చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రుద్రమదేవి చిత్రం కూడా అక్టోబరు 9నే విడుదల కాబోతోంది. ఐతే ఏంటట అనుకోవచ్చు. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. రుద్రమదేవిలో రాణీ రుద్రమదేవిగా కత్తిపట్టి యుద్ధభూమిలో కనిపిస్తుంది. ఇక సైజ్ జీరో ఇందుకు డిఫరెంట్. ఇపుడు అమ్మాయిల్లో నెలకొన సైజ్ జీరో క్రేజ్ పైన ఈ చిత్రం సాగుతున్నట్లు పోస్టర్లను బట్టే తెలుస్తుంది. రుద్రమదేవి చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తనే నిర్మాతగా మారి భారీ ఖర్చుతో చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక సైజ్ జీరో చిత్రం విషయానికి వస్తే... ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’.
ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సైజ్ జీరో’తో మన ముందుకు రానుంది. ఈ చిత్రం వెయిట్ లాస్కి సంబంధించిన కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది. దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి వినూత్నమైన సబ్జెక్ట్తో కమర్షియల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో’ సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ను క్రియేట్ చేసింది.
ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, పోస్టర్స్లో గ్లామర్తో పాటు భిన్నమైన భారీ లుక్తో ఉన్న అనుష్కను చూసి ఆమె మరో డిఫరెంట్ పాత్రలో కనిపించనుందని సినీ అభిమానులకు అర్థమైంది. దాదాపు నాలుగు మిలియన్స్ వ్యూవర్స్తో ఇటీవల విడుదలైన టీజర్కి మంచి స్పందన వచ్చింది. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు.
టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్నందిచిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి కూడా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 9న విడుదల చేయడానికి భారీ లెవల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కూడా ఈ చిత్రంలో భారీగా ఉంటుందని చిత్ర యూనిట్ పెర్కొంది.
అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.