శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (15:23 IST)

పక్కా ప్లాన్ ప్రకారమే శ్రీదేవిని చంపేశారు: మాజీ ఏసీపీ

అందాల సినీ నటి శ్రీదేవిని పక్కా ప్లాన్‌తో చంపేశారనీ ఢిల్లీకి చెందన మాజీ వేద్‌భూషణ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. శ్రీదేవి మృతిపై ఈయన చేసిన

అందాల సినీ నటి శ్రీదేవిని పక్కా ప్లాన్‌తో చంపేశారనీ ఢిల్లీకి చెందన మాజీ వేద్‌భూషణ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. శ్రీదేవి మృతిపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివావాదస్పదమయ్యాయి.
 
నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని తొలుత దుబాయ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించగా బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు తేలింది. 
 
ఈనేపథ్యంలో వేద్‌భూషణ్ స్పందిస్తూ, 'బాత్‌టబ్‌లో బలవంతంగా ముంచి చంపడం చాలా సులువు. అలా చేస్తే మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదు. ఆమెను పథకం ప్రకారం చంపేశారని నాకు అనిపిస్తోంది. దుబాయ్‌ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై నాకు సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం' అని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
కానీ ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆమె మృతి విషయంలో తాము కలగజేసుకోలేమని తేల్చి చెప్పింది. కాగా, పదవీ విరమణ పొందాక భూషణ్‌ దిల్లీలో ఓ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీని నడుపుతున్నారు.