'శ్రీమంతుడు' బాటలో శ్రుతి హాసన్.. గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి రెడీ..
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'శ్రీమంతుడు'. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ను బద్దలు కొట్టిన ఈ సినిమా, మహేష్కు సూపర్ సక్సెస్ను అందించడంతోపాటు, అందరికీ స్పూర్తిగానూ నిలిచింది. చిత్రంలో ‘చారుసీల′ పాత్రలో నటించిన శ్రుతి హాసన్ ‘హర్ష’ పాత్రలో నటించిన మహేష్ని విలేజ్ని దత్తత తీసుకోమని ప్రోత్సహిస్తుంది. ఇక మహేష్ బాబు ‘బుర్రిపాలెం’ అనే విలేజ్ని, తెలంగాణాలోని ఇంకొక విలేజ్ని దత్తత తీసుకున్నారు.
ప్రస్తుతం తాజా సమాచారం ఏమిటంటే.. శ్రుతి హాసన్ కూడా తమిళనాడులోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని మోడల్ విలేజ్గా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని శ్రుతినే ఇటీవల అభిమానులతో తెలిపింది. అయితే తాను మహేష్ను ఫాలో కావడం లేదని, ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవానే ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని తెలిపింది. త్వరలోనే తాను ఒక గ్రామాన్ని దత్త తీసుకుని, దాన్ని మోడల్ విలేజ్గా మారుస్తానని తెలిపింది.