గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (16:37 IST)

ఎస్ఎస్.రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఇదే.. కథ ఎలాంటిదో తెలుసా?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఇచ్చారు. "బాహుబలి 2" బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును చేపడుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనికితోడు కాస్త రిలీఫ్ లభించేల

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఇచ్చారు. "బాహుబలి 2" బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును చేపడుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనికితోడు కాస్త రిలీఫ్ లభించేలా.. చిన్న ప్రాజెక్టును చేపడుతానని రాజమౌళి చెప్పినట్టు లోగడ వార్తలు కూడా వచ్చాయి. వీటిపై రాజమౌళి ఇపుడు క్లారిటీ ఇచ్చాడు. 
 
తాజాగా ఆయన ఓ సినిమా ఆడియో లాంచ్‌లో పాల్గొని మాట్లాడుతూ... "నేను చిన్న సినిమా తీయాలని అనుకోవట్లేదు. బాహుబలిని విజువల్ ఎఫెక్ట్స్‌తో తీశాను. వీఎఫ్ఎక్స్‌తో సినిమా తీయడం అంతా సులభం కాదు. కానీ, నేనిప్పుడు వీఎఫ్ఎక్స్‌తో సినిమా తీయను. అలా అని చిన్న సినిమా తీస్తానని కాదు. నా తదుపరి చిత్రం చిన్న సినిమా కాదు. విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఓ భారీ సినిమాను తీయొచ్చు" అని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతం తన తండ్రి ఓ ఎమోషనల్ కథను సిద్ధం చేస్తున్నారని, స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక ఆ కథకు తగినట్టుగా నటీనటులను ఎంపిక చేస్తామనంటూ రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటించే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించే సూచనలు కనిపిస్తున్నాయి.