బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (16:53 IST)

నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది.. భర్త కార్తీక్‌తో విడాకులు తీసుకుంటున్నా: సుచిత్ర

నటుడు ధనుష్ ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిన తర్వాతే తన ట్విట్టర్ హ్యాక్ అయిన విషయం తెలియవచ్చిందని సింగర్ సుచిత్ర తెలిపింది. ఇటీవల సుచిత్ర ట్విట్టర్ పేజీలో ధనుష్, హన్సిక, త్రిష, సంజిత రెడ్డిల ఫోటోలు లీకైయ

నటుడు ధనుష్ ఆఫీస్ నుంచి తనకు ఫోన్ వచ్చిన తర్వాతే తన ట్విట్టర్ హ్యాక్ అయిన విషయం తెలియవచ్చిందని సింగర్ సుచిత్ర తెలిపింది. ఇటీవల సుచిత్ర ట్విట్టర్ పేజీలో ధనుష్, హన్సిక, త్రిష, సంజిత రెడ్డిల ఫోటోలు లీకైయ్యాయి. ఇంకా సింగర్స్ చిన్మయి, అనిరుధ్, ఆండ్రియా, పార్వతీ నాయర్, అమలాపాల్ ఫోటోలు కూడా రిలీజయ్యాయి. వీడియోలు కూడా త్వరలో రిలీజ్ అవుతాయని సుచిత్ర ట్విట్టర్ పేజీ పోస్టుల్ని బట్టి తెలుస్తోంది. 
 
ఈ ఫోటోలపై సంజిత రెడ్డి మాత్రం సుచిత్ర లీక్స్ వున్నది తాను కాదంటూ వివరణ ఇచ్చింది. దీనిపై సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ట్విట్టర్ హ్యాక్ అయిన విషయం.. ధనుష్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిన తర్వాతే తనకు తెలుసునని చెప్పింది. వాటిని డిలీట్ చేయాలని చూశాను. కానీ భారీగా ఫోటోలు లైన్‌గా వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని తన ట్విట్టర్‌ను హ్యాక్ చేయాల్సిందిగా ట్విట్టర్‌ యాజమాన్యానికి లేఖ పంపానని తెలిపింది. జల్లికట్టు సందర్భంగా ఫేస్ బుక్, లీక్స్ ద్వారా తన ట్విట్టర్ హ్యాక్ అయ్యిందన్నారు. 
 
ఎవరో తన ట్విట్టర్ ద్వారా పనికానిచ్చేస్తున్నారని సుచిత్ర వెల్లడించింది. ఎవరికి ఎవరి మీద ఈర్ష్య, ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో తన ట్విట్టర్‌ను ఉపయోగించుకుంటున్నారో తెలియట్లేదన్నారు. తన ట్విట్టర్ పేజీని 4 లక్షలకు పైబడిన వారు ఫాలో అవుతున్నారు. ఇందుకు బ్లూటిక్ లేని కారణంగా సులభంగా హ్యాక్ చేయొచ్చునని సుచిత్ర తెలిపారు. ఈ లీక్స్ వ్యవహారంతో తన భర్త కార్తీక్‌తో విడాకులు తీసుకునే స్థాయికి వచ్చేశానని చెప్పింది. 
 
పదేళ్ల పాటు కార్తీక్‌తో వివాహజీవితాన్ని గడిపానని.. కానీ ప్రస్తుతం తన పెళ్లి జీవితం కూడా బజారుకొచ్చేసిందని.. తన భర్త రాముడని.. తనకు ఆయన పూర్తి మద్దతు ఇస్తారని.. కానీ కొన్ని సమస్యల కారణంగా తాము విడిపోతున్నామని సుచిత్ర వెల్లడించింది.