జూలై 1న వస్తున్న సూపర్ స్టార్ సూర్య "మేము"
సూపర్ స్టార్ సూర్య - అమలాపాల్ - బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో అనువాదమవుతుండటం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ను "స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ "2డి ఎంటర్టైన్మెంట్స్" పతాకంపై.. సూర్య స్వయంగా సమర్పిస్తుండటం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న "మేము" చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... "సూపర్ స్టార్ సూర్య - స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాల సంయుక్త సమర్పణలో "మేము" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. "ప్రతి తల్లీతండ్రి తమ పిల్లలతో కలిసి ఖచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా ఇది" అని తమిళ మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియా సైతం ముక్త కంఠంతో తీర్మానించిన గొప్ప సినిమా ఇది. వరుస విజయాలతో తమిళంలో సంచలన దర్శకుడిగా పేరొందిన పాండిరాజ్ "మేము" చిత్రంతో తన ప్రతిభాపాటవాలు మరోసారి నిరూపించుకున్నాడు.
జూలై 1న ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్స్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్రోల్ కొరెల్లి, చాయాగ్రహణం: బాలసుబ్రమణియన్, మాటలు - పాటలు: శశాంక్ వెన్నెలకంటి, సమర్పణ: "సూపర్ స్టార్" సూర్య-కె.ఇ. జ్ఞానవేల్ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పాండిరాజ్.