శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (15:53 IST)

నాకు ఇష్టమైన న‌టుడు రంగనాథ్‌... తమ్మారెడ్డి భరద్వాజ

జ‌వాన్ అండ్ కాస్పియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై సంజీవ్‌, సాయికృప జంట‌గా సుధాక‌ర్ వినుకొండ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం "ఇద్ద‌రం". కిర‌ణ్ శంక‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. హీరో న‌వ‌దీప్ తొలి ఆడియో సీడీని అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ... ఈ సినిమా ప్రోమోను ముందే చూశాను. చాలా బాగా అనిపించింది. సందీప్‌తో నాకు మంచి ప‌రిచ‌య‌మే ఉంది. సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడ‌నిపించింది. అలాగే నాకెంతో ఇష్ట‌మైన న‌టుడు రంగనాథ్‌. ఈ సినిమాలో యాక్ట్ చేశారు. పాట‌లు, సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆ తర్వాత న‌వ‌దీప్ మాట్లాడుతూ... ట్రైల‌ర్‌, పాట‌లు చాలా బావున్నాయి. సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌నిపించింది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అని చెప్పారు. 
 
ద‌ర్శ‌కుడు సుధాక‌ర్ మాట్లాడుతూ... మనం పేప‌ర్స్‌లో గ్యాంగ్ రేప్స్ గురించిన వార్త‌ల‌ను చ‌దువుతూనే ఉంటాం. ఆ గ్యాంగ్ రేప్ చేసేవాళ్ల‌లో ఒక మంచి వ్య‌క్తి ఉంటే ఏమ‌వుతుంద‌నే కాన్సెప్ట్‌తో చేసిన సినిమాయే ఇది. మంచి రొమాంటిక్‌, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ మూవీ. సినిమాను జూలై 1న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.