శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (11:33 IST)

బాలీవుడ్‌లో మీ టూ ప్రకంపనలు.. అలోక్ నాథ్.. పచ్చి తాగుబోతు..

బాలీవుడ్‌ను మీ టూ తాకింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు పాకిన ఈ మీ టూపై స్పందించే వారి సంఖ్య అధికమవుతోంది. మొన్నటికి మొన్న తనుశ్రీ దత్తా నానా పటేకర్‌పై, నిన్నటికి నిన్న కంగనా రనౌత్ క్వీన్ సినిమా దర్శకుడిపై విమర్శలు చేశారు. తాజాగా  తాజాగా ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా తనకు ఏర్పడిన చేదు అనుభవాన్ని బహిర్గతం చేశారు.
 
రెండు దశాబ్దాలుగా తనలో తనే ఈ విషయాన్ని దాచుకుని బాధపడుతున్నానని తెలిపింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ విషయాన్ని బయటపెట్టాలని వేచి చూస్తున్నానని ఫేస్‌బుక్‌లో వింటా నందా వెల్లడించింది. ప్రముఖ సినీ, టీవీ నటుడు అలోక్ నాథ్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. తనతో బలవంతంగా మద్యం తాగించి అలోక్ నాథ్ తనను 20 ఏళ్ల క్రితం రేప్ చేశాడని వివరించింది. 
 
తననే కాదు.. అప్పట్లో టీవీ షో తారా ప్రధాన నటిని కూడా అతడు లైంగికంగా వేధించాడని, దీనిపై కంప్లైంట్ చేసినందుకు ఆమెని షో నుండి తీసేశారని వెల్లడించింది. పచ్చి తాగుబోతు అయితే అలోక్ నాథ్ బయటకి మాత్రం మంచి వ్యక్తిగా చెలామణి అవుతున్నాడని వింటా నందా ఆవేదన వ్యక్తం చేసింది.