గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (14:31 IST)

బుల్లితెరను వదులుకోను: అవికా గోర్‌

సంతోష్‌ శోభన్‌, అవికా గోర్‌ ప్రధాన పాత్రల్లో సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్మోహన్‌ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'తను నేను'. ఇందులో అవికాగోర్‌ కీర్తి అనే పాత్రల్లో నటిస్తోంది. చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ... చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించే అమ్మాయి, తనకు నచ్చింది మాత్రమే చేస్తూ వుంటుంది. నిజజీవితానికి భిన్నంగా వుండే పాత్ర. రియల్‌లైఫ్‌లో సొంత నిర్ణయాలు తీసుకోలేను.
 
ఈ చిత్రంలో పాత్ర చూసి ఇలానే వుంటానని అనుకుంటారు. ఇదొక సెస్సిబుల్‌ లవ్‌ స్టోరీ. రెగ్యులర్‌గా వుండదు. 'ఉయ్యాల జంపాల' తర్వాత రామ్మోహన్‌గారితో కలిసి పనిచేశాను.  స్క్రిప్ట్‌ వినగానే మరోసారి టీంతో కలిసి పనిచేయాలనే ఉద్దేశ్యంతో ఓకే చేశాను. రామ్మోహన్‌గారు నిర్మాతగా వ్యవహరించడానికి, దర్శకునిగా పనిచేయడానికి చాలా వ్యత్యాసం వుంది. ఆయన ఎలా చెప్పారో అలానే నటించాను.
 
ఈ సినిమాతో మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పారు. టీవీ సీరియల్స్‌ గురించి చెబుతూ... టీవీకి, సినిమాకు నటిగా చాలా వ్యత్యాసముంది. నేను సినిమాల్లో నటిస్తూనే సీరియల్స్‌లో కూడా చేస్తాను. సీరియల్స్‌ మాత్రం వదులుకోను. త్వరలో కొత్త సినిమా చేయబోతున్నాను. ఆ చిత్ర కథ చాలా బాగుంది. త్వరలో వివరాలు తెలియజేస్తాను అని చెప్పారు.