బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (06:35 IST)

ముంబై దాడుల నేపథ్యంలో చిత్రం... ప్రధాన పాత్రలో త్రిష?

'నాయకి'గా వెండితెరపై ఆకట్టుకున్న చెన్నై చిన్నది త్రిష సినీ రంగంలో అడుగుపెట్టి దశాబ్దకాలం కావొస్తుంది. అయినప్పటికీ ఈ మిస్‌ చెన్నైకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల 'నాయకి', 'ధర్మయోగి' చిత్రాలతో

'నాయకి'గా వెండితెరపై ఆకట్టుకున్న చెన్నై చిన్నది త్రిష సినీ రంగంలో అడుగుపెట్టి దశాబ్దకాలం కావొస్తుంది. అయినప్పటికీ ఈ మిస్‌ చెన్నైకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల 'నాయకి', 'ధర్మయోగి' చిత్రాలతో ఆకట్టుకున్న త్రిష మరో అయిదు చిత్రాల్లో నటించేందుకు సమ్మతించగా, తాజాగా, మరో కొత్త ప్రాజెక్ట్‌కు సంతకం చేసిందట. 
 
ఈ చిత్రం ముంబై ఉగ్రదాడుల నేపథ్యంతో తెరకెక్కనుంది. ఈ సినిమాకి '1818' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైండ్‌ డ్రామా పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రాన్ని రిథున్‌ సాగర్‌ దర్శకత్వం వహించనున్నారు. 
 
ఈ సినిమాలో త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. సుమన్‌, రాజేంద్ర ప్రసాద్‌, రమేశ్‌ తిలక్‌, మీరా ఘోషల్‌లు కీలక పాత్రలో నటించనున్నారు. తెలుగు, తమిళంలో ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఎస్‌ఎస్‌.థమన్‌ ఈ చిత్రంలోని పాటలకు సంగీత బాణీలు సమకూరుస్తున్నారు.