శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (11:13 IST)

టాలీవుడ్‌లో కొనసాగుతున్న సీక్వెల్ ట్రెండ్... 'లేడీస్ టైలర్‌'కు సిద్ధమవుతున్న సీక్వెల్..

టాలీవుడ్‌లో ప్రస్తుతం సీక్వెల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే రాజమౌళికి భారీ విజయాన్ని అందించిన 'బాహుబలి' సీక్వెల్‌గా బాహుబలి-2 సిద్ధమవుతోంది. అదే విధంగా ఇప్పటికే రవితేజ నటించిన కిక్ 1, కిక్ 2 సినిమాలో గ్రాండ్ సక్సెస్ కావడంతో కిక్ 3 సీక్వెల్‌ను తీసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పుడు తాజాగా రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా వంశీ దర్శకత్వంలో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'లేడీస్ టైలర్' సినిమాకు సీక్వెల్‌గా కొత్త సినిమాను రూపొందించనున్నారు. 
 
అప్పట్లో యువతరాన్ని ఓ ఊపు ఊపిన లేడిస్ టైలర్ సినిమా ఇన్నేళ్ల తర్వాత దర్శకుడు వంశీ ప్రస్తుతం దీనికి సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డాడు. దీని పేరు 'ఫ్యాషన్ డిజైనర్... s/o లేడీస్ టైలర్'గా నిర్ణయించారు. ఇటీవల 'సినిమా చూపిస్త మావ' సినిమాతో యూత్‌ని బాగా ఆకట్టుకున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. 
 
విశేషం ఏమిటంటే, అప్పట్లో 'లేడీస్ టైలర్'కు రచన చేసిన తనికెళ్ళ భరణి దీనికి కథ అందిస్తున్నాడు. ప్రస్తుతం వంశీ ఈ సినిమా స్క్రిప్టు పనిలో బిజీగా వున్నాడు. మధుర శ్రీధర్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ నవంబర్‌లో సెట్‌పైకి ఎక్కుతుందని సమాచారం.