శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (15:05 IST)

'సంతోషం సగం బలం' అంటున్న వెంకటేష్... ముచ్చటగా మూడోసారి నయన...

విక్టరీ వెంకటేష్ 'గోపాల గోపాల' హిట్టు తర్వాత మరో చిత్రాన్ని అంగీకరించలేదు. ఆ సమయంలో తండ్రి రామానాయుడు మృతి చెందడం కారణం కాగా, ఆ తర్వాత వచ్చిన కథలు తనకు నచ్చక కొంత గ్యాప్ వచ్చింది. అయితే తాజాగా కొత్త చిత్రానికి సైన్ చేశాడు. ‘మళ్ళి మళ్ళి ఇది రాని రోజు’ చిత్రంతో హిట్ కొట్టిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ఇంకా సెట్ పైకి వెళ్లక ముందే ఈ సినిమా పేరు కూడా ప్రచారంలోకి వచ్చేసింది. ఈ చిత్రానికి 'సంతోషం సగం బలం' అనే పేరు పెడుతున్నట్టు సమాచారం.
 
గతంలో 'లక్ష్మీ', 'తులసీ' వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన నయనతార ముచ్చటగా మూడోసారి వెంకటేష్ సరసన నటిస్తోంది. ఇటీవల ‘పండగ చేస్కో’ చిత్రాన్ని నిర్మించిన పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందించగా, జ్ఞన్ శేఖర్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఆగష్టు చివరి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.