గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (09:02 IST)

కిడ్నాప్, మర్డర్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్... నిజమా?

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌పై కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో అమెను అరెస్టు చేసేందుకు ముంబై పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పైగా ఆమె ఆచూకీ తె

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌పై కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో అమెను అరెస్టు చేసేందుకు ముంబై పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పైగా ఆమె ఆచూకీ తెలిపిన వారికి రివార్డు కూడా ఇస్తామని ప్రకటించారు. 
 
ఏంటి.. ఈ వార్త నిజమేనా అనే కదా మీ సందేహం. ఈ తరహా వార్తల సోషల్ మీడియా ట్విటర్‌లో కనిపించింది. ఇది వైరల్‌గా మారింది. తీరా ఆరా తీస్తేగానీ.. ఇది రియల్ లైఫ్ కాదనీ.. రీల్ అని తేలిపోయింది. ఓ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌ను విద్యాబాలన్ ఇలా తన ట్విటర్ ప్రోఫైల్‌లో ఇలా డిఫరెంట్‌గా పెట్టింది. 
 
విద్యా బాలన్ నటిస్తున్న 'కహానీ-2' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ కూడా ఇలాగే రిలీజ్ చేశారు. ఇందులో విద్య దుర్గా రాణీ సింగ్‌ పాత్రలో కన్పించబోతోంది. విద్యాబాలన్ మెయిన్ రోల్‌లో తెరకెక్కిన "కహానీ" సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. కనపడకుండా పోయిన తన భర్త ఆచూకీని తెలుసుకునేందుకు ఓ గర్భిణీ ఎలా ముందుకెళ్లిందనే ఇతివృత్తంతో సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన కహాని బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచింది. 
 
ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌గా 'కహానీ-2' తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇలా డిఫరెంట్‌గా పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో విద్యాబాలన్‌తో పాటు అర్జున్‌ రామ్ పాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుజయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఎక్కవ భాగం షూటింగ్ కోల్‌కతా జరిగింది. ఈ చిత్రం డిసెంబర్‌ 2న విడుదల కాబోతోంది.