శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2017 (17:31 IST)

విశాల్ శపథం: 2018 వరకు పెళ్లి చేసుకోను.. నడిగర్ సంఘం భవన నిర్మాణం.. కార్తీ-విశాల్.. భారీ విరాళం

తమిళ హీరో విశాల్ 2018 వరకు పెళ్లి చేసుకునేది లేదని శపథం చేశాడు. శుక్రవారం దక్షిణ నటీనటుల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత

తమిళ హీరో విశాల్ 2018 వరకు పెళ్లి చేసుకునేది లేదని శపథం చేశాడు. శుక్రవారం దక్షిణ నటీనటుల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సత్యరాజ్, సూర్య, శింబు, అరుణ్ విజయ్, శివకుమార్, శారద, కాంచన, వైజయంతీమాల, కోవైసరళ, వంటి అగ్రతారలు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 
 
ఈ నేపథ్యంలో నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ ప్రకటించాడు. భవన నిర్మాణాన్ని ఆపేందుకు చేసే ప్రయత్నాలను అధిగమించి పూర్తి చేస్తామని..2018 సెప్టెంబర్ లోపు భవన నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ భవన నిర్మాణం లాంఛనంగా ప్రారంభమవుతుందని విశాల్ చెప్పుకొచ్చారు. అయితే అప్పటి వరకు తాను పెళ్లి చేసుకోనని తెలిపారు.

దక్షిణ నటీనటుల సంఘం కోసం భవనం నిర్మితం కావడం కోలీవుడ్‌కు పండగ లాంటిదని విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా విశాల్, కార్తీ భవన నిర్మాణం కోసం చెరో రూ.10కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.