గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (18:08 IST)

ఆరాధ్యను గాయపరిచారట: మీడియా సిబ్బందిపై ఐశ్వర్యారాయ్ యాంగ్రీ!

అందాల రాశి ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్యను మీడియా గాయపరిచింది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వ్యాన్ నుంచి దిగి తన కుమార్తె ఆరాధ్యతో పాటు ఇంటికి వెళ్ళేందుకు ఐశ్వర్యారాయ్ రెడీ అయ్యారు. ఆ సమయంలో ఆరాధ్యను ఆమె ఎత్తుకునే ప్రయత్నం చేశారు. అయితే కెమెరామెన్లు ఐశ్వర్యాను, ఆమె కుమార్తెను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు.
 
ఇది ఇష్టపడని ఐశ్వర్యా అక్కడ నుంచి వేగంగా వెళ్ళేందుకు ప్రయత్నించారు. వేగంగా వెళ్ళి తన కూర్చునే క్రమంలో ఆరాధ్యకు గాయాలయ్యాయి. దీంతో ఆరాధ్య ఏడుపు లంకించుకుంది. ఫలితంగా సహనం కోల్పోయిన ఐష్ మీడియా సిబ్బందిని సీరియస్‌గా చూసి.. అక్కడి నుంచి ఎవ్వరితో మాట్లాడకుండా నిష్క్రమించారు.