'భలె భలె మగాడివోయ్'లో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది... నాని
అల్లు అరవింద్ సమర్పణలో, GA2 (A Division of Geetha Arts) బాన్యర్పై UV Creations సంయుక్తంగా ప్రొడక్షన్ నెం. 1గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్". నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. మారుతి దర్శకుడు. బన్ని వాసు నిర్మాత. ఇటీవలే గోవాలోని అందమైన లొకేషన్స్లో ఓ పాట చిత్రీకరించారు. మరో పాటని హైదరాబాద్లో చిత్రీకరించటంతో టోటల్ షూటింగ్ పూర్తయింది. ఈ పాటలకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ఆడియోని అగష్టు మెదటి వారంలో విడుదల చేసి అగష్టులోనే చిత్రాన్ని కూడా విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: " భలే భలే మగాడివోయ్ నా కెరీర్లో స్పెషల్ సినిమా. ఈ తరహా క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర. దర్శకుడు మారుతి చెప్పిన కథ నచ్చటంతో వెంటనే అంగీకరించమే కాకుండా ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం.ఇటీవలే గోవాలో , హైదరాబాద్లో రెండు పాటలు చిత్రీకరణతో సినిమా కప్లీటయ్యింది. శేఖర్ మాస్టర్ నా బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. తక్కువ టైంలో ఈ చిత్రం పూర్తయింది.
లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. మురళి శర్మ సర్ప్రైజింగ్ పాత్రలో అందిరిని ఆకట్టుకుంటారు. అల్లు అరవింద్ గారి సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్పై UV Creations బ్యానర్లో బన్నివాసు నిర్మాతగా ఈ చిత్రం చేయటం చాలా హ్యాపీగా వుంది. ఎక్కడా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా షూటింగ్ అంతా అయిపోయింది. తప్పకుండా ఫ్యామిలి అంతా థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన చిత్రం" అని అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ, " రెగ్యులర్ సినిమాలతో పోల్చితే భలే భలే మగాడివోయ్ సినిమా కొత్తగా ఉంటుంది. ప్రతీ అంశాన్ని చాలా కేర్ఫుల్గా చిత్రీకరిస్తున్నాం. నాని, లావణ్య మద్యలో వచ్చే సన్నివేశాలు, నాని, నరేష్, వెన్నెల కిషోర్ల మధ్యలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇటీవలే గోవాలో పాట చిత్రీకరించాం. హైదరాబాద్లో సెట్ సాంగ్ టైటిల్ సాంగ్గా చిత్రీకరించాం, ఈ రెండు పాటలు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ముఖ్యంగా హీరో నాని, లావణ్యని అత్యంత అందంగా చూపించారు. అలాగే ఆర్ట్ వర్క్ రమణతో పాటు నా టెక్నిషియన్స్ అందరూ చాలా బాగా పనిచేశారు. త్వరలో ఆడియో విడుదల చేసి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం" అని అన్నారు
నటీనటులు.. నాని, లావణ్య త్రిపాఠి, మురళి శర్మ, నరేష్, సితార, స్వప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, బద్రమ్ మరియు తదితరులు.. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, ఎడిటర్:ఉద్దవ్, ఆర్ట్:రమణ వంక, ఫొటొగ్రఫి:నిజార్ షఫి, సంగీతం: గోపి సుందర్, నిర్మాత: బన్నివాసు, రచన, దర్శకత్వం:మారుతి.