ఆగస్టు 1న 'గాల్లో తేలినట్టుందే'
అజయ్వర్మ, ఖుషి జంటగా చిత్రం 'గాల్లో తేలినట్టుందే'. ఎస్వికె సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకట్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట సురేష్ గుణ్ణం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది.
ప్రేమకథతో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. యువతరం మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. మంచి నటీనటులు, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటుంది. ఇటీవలే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని' తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ... దర్శకుడిగా నా మొదటి చిత్రమిది. సమాజంలోని ప్రతి కుర్రాడు తన జీవితమే అనుకునేలా ఈ సినిమాలోని పాత్రలు సాగుతాయి. ఆద్యంతం నవ్విస్తూనే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. సాయికార్తీక్ బాణీలు ఆట్టుకుంటున్నాయి' అని చెప్పారు. కథానాయకుడు తెలుపుతూ... నన్ను నమ్మి నాకు అవకాశమిచ్చారు నిర్మాత. వారి అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జబర్దస్త్ నవీన్, మౌనిక, శీలం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.భాస్కర్, శీలం లక్ష్మణ్.