రెజీనా 'నిర్ణయం' వస్తోంది...
రెజీనా కథానాయికగా రూపొందిన తమిళ చిత్రం 'నిర్ణయం'. రాణా విక్రమ్ కథానాయకుడు. శరవణన్ దర్శకత్వం వహించారు. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అదే టైటిల్తో లావా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఎ.వై.ఎస్. చౌదరి సమర్పణలో కె. జోత్స్నరాణి, ఎం.లక్ష్మీ, సురేష్ నిర్మాతలు.
డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు తెలుపుతూ... ఓ పెద్ద కుటుంబానికి చెందిన కుర్రాడు పేదింటి అమ్మాయిని ప్రేమిస్తే పెద్దలు అంగీకరించకపోతే ఇంటినుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ తరువాత వారి జీవితాల్లో ఎలా ముపులు తిరిగాయనేది కథ. సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. బేబి వేదిక కీలక పాత్ర పోషిస్తుంది.
సెల్వగణేస్ మెలోడి పాటలను ఇచ్చారు. ప్రతిపాటా గుర్తిండి పోతుంది. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం డిటిఎస్ జరుగుతోంది. మరో పది రోజుల్లో పాటలను, ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చిట్టిబాబు, మాటలు, పాటలు: మహేష్ అల్లు.