మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By PNR
Last Updated : శుక్రవారం, 10 జులై 2015 (13:08 IST)

ఊహకందని మలుపులు.. విజువల్ - గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్‌తో 'బాహుబలి'.. ఫస్టాఫ్ స్టోరీ ఎలా వుందంటే..?

ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ వచ్చిన "బాహుబలి" చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో మొదటి భాగంలో కథ ఎంతో ఆసక్తిగానూ, ఊహకందని మలుపులతో ఉంది. మహిష్మతి రాజ్య రాణిగా దేవయాని (అనుష్క) ఉంటుంది. ఈమెపై భల్లాల దేవుడు(రానా) కన్నువేస్తాడు. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని భావిస్తాడు. ఇందుకు ఆమె సమ్మతించక పోవడంతో ఆమెను బందీగా చేస్తాడు. 
 
అయితే, తన బిడ్డను తనకు అత్యంత నమ్మకస్తురాలు, సాహసవంతురాలైన శివగామి (రమ్యకృష్ణ) ద్వారా దేశం దాటిస్తుంది. దేశాన్ని దాటించేటపుడే తన బిడ్డకు బాహుబలి (ప్రభాస్) అని నామకరణం చేస్తుంది దేవయాని. అయితే, బాహుబలి ఓ గిరిజన తెగకు చెందిన ప్రజల్లో పెరిగి పెద్దవాడవుతాడు. 
 
ఆ ప్రజలు అతనికి శివుడు అని పేరుపెడతాడు. ఈ క్రమంలో అనేక మలుపులు ఉంటాయి. మొదటి భాగంలో అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో బాహుబలిని తెరకెక్కించారు. ముఖ్యంగా విశాలమైన సామ్రాజ్యంతో పాటు కొండ ప్రాంతం, స్నోఫాల్స్‌ను విజువల్ గ్రాఫిక్స్‌తో అత్యద్భుతంగా చిత్రీకరించారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని మాయ చేస్తూ బాహుబలి మొదటి భాగం ఫస్టాఫ్‌ను లాగించేశారు.