థమన్ మ్యూజికల్ నైట్లో నితిన్, నాగచైతన్య!
హుదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ తన ట్రూప్తో కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నీరజ కోన ఆధ్వర్యంలో అక్టోబర్ 19న హైదరాబాద్ జి.వి.కె.మాల్లోని హార్డ్రాక్ కెఫెలో ఈ మ్యూజికల్ నైట్ జరిగింది. ఈ షోకి హీరోలు నాగచైతన్య, నితిన్, మంచు మనోజ్, హీరోయిన్లు హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, భర్త యాండీ శ్రీనివాసన్తో కలిసి మంచు లక్ష్మీ అతిథులుగా విచ్ఛేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ- ''హుదూద్ తుపాన్ బాధితుల కోసం నిర్వహిస్తున్న ఈ షోకి భారీగా తరలి వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలుగు వారు ఎక్కడ ఆపదలో వున్నా ఆదుకోవాల్సిన బాధ్యత మనకు వుంది. ఈ విషయంలో అందరూ ముందు వుండాలి'' అన్నారు.
ఈ షో ద్వారా వచ్చిన భారీ మొత్తాన్ని ఎ.పి. సి.ఎం. రిలీఫ్ ఫండ్కి అందిస్తామని షో నిర్వాహకురాలు నీరజ కోన తెలిపారు.