శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (17:29 IST)

నాలుగేళ్లుగా మహిళా హెడ్ కానిస్టేబుల్‌‌పై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం...

దేశంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోతోంది. హర్యానా రాష్ట్రంలో ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై మరో హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా ఏకంగా నాలుగేళ్ళుగా ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చాడు.

దేశంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండాపోతోంది. హర్యానా రాష్ట్రంలో ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై మరో హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీకూడా ఏకంగా నాలుగేళ్ళుగా ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈక్రమంలో ఓ రోజు రాత్రి మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనతో సన్నిహితంగా ఉండే ఫోటోలు చూపిస్తూ బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేయసాగాడు. ఇలా నాలుగేళ్లుగా అత్యాచారం చేయసాగాడు. అతని లైంగిక వేధింపులు భరించలేని ఆమె పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. 
 
దీనిపై మహిళా బాధితురాలు స్పందిస్తూ, ప్రధాన నిందితుడు జోగీందర్‌ అలియాస్‌ మింటూతో పల్వాల్‌ జిల్లా అల్వార్‌పూర్‌లో 2014లో తనకు తొలిసారి పరిచయమయ్యారని బాధితురాలు వెల్లడించారు. ఫరీదాబాద్‌, జింద్‌, పల్వాల్‌లో పనిచేస్తుండగా జోగీందర్‌ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు. జూన్‌ 2017లో నిందితుడి సోదరుడు కూడా అత్యాచారం చేసినట్టు పేర్కొంది. 
 
దీనిపై జిల్లా ఎస్పీ వసీం అక్రమ్ స్పందిస్తూ, మహిళా హెడ్ కానిస్టేబుల్ చేసిన ఆరోపణలపై లైంగిక దాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, అయితే, పోలీస్‌ స్టేషన్‌లోనే లైంగిక దాడి జరిగిందన్న మీడియా కథనాలు అవాస్తమని తెలిపారు.