గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 6 మే 2018 (15:14 IST)

వారిని ఉరితీయండి లేదా మమ్మలను కాల్చి చంపండి : రేప్ బాలిక తల్లి

తన 8 యేళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చంపేసిన నిందితులను ఉరితీస్తారా లేదా మమ్మలను కాల్చి చంపండంటూ ఆ బాలిక తల్లి ప్రాధేయపడుతోంది.

తన 8 యేళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చంపేసిన నిందితులను ఉరితీస్తారా లేదా మమ్మలను కాల్చి చంపండంటూ ఆ బాలిక తల్లి ప్రాధేయపడుతోంది. ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా గ్రామంలో కొందరు కామాంధులు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఎంత సంచలనం రేపిందో తెలిసిందే.
 
ఈ ఘటనపై ఆ బాలిక తల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, నిందితులనైనా ఉరి తీయండి.. లేదంటే మమ్మల్ని కాల్చి చంపండి అని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వాళ్లను వదిలేస్తే మమ్మల్ని ఎలాగూ చంపుతారు. నాలుగు గ్రామాల ప్రజలు ఇప్పుడు మా వెంట పడుతున్నారు. మేం కేవలం నలుగురం ఉన్నాం. అన్నీ కోల్పోయాం. మా ఇల్లు, ఆస్తి పోయింది అని ఆమె చెప్పింది.
 
అంతేకాకుండా, సీబీఐ విచారణకు అంగీకరించాలని స్థానిక నేతలు తమపై ఒత్తిడి తెస్తునారని బాలిక తల్లి వెల్లడించింది. అయితే బాలిక కుటుంబం మాత్రం రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. నిందితులను కాపాడటం కోసమే స్థానిక నేతలు సీబీఐ విచారణ కోసం పట్టుబడుతున్నారని బాలిక తల్లి ఆరోపించింది. 
 
మేము ఫిర్యాదు ఇచ్చిన సమయంలోనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే మా బిడ్డ బతికేది. కానీ వాళ్లు ఏడు రోజుల పాటు ఏమీ చేయకుండా ఖాళీగా చేతులు ముడుచుకుని కూర్చున్నారు అని ఆమె విమర్శించింది. 
 
మరోవైపు,  ఈ కేసును కథువా నుంచి మరోచోటికి బదిలీ చేయాలంటూ బాలిక తండ్రి ఇప్పటికే  సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. మరో రెండు రోజుల్లో దీనిపై కోర్టు తీర్పు వెలువరించనుంది.