గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By pnr
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (14:51 IST)

#Budget2018 : తెలుగు రాష్ట్రాలకు హ్యాండిచ్చిన అరుణ్ జైట్లీ(Video)

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు తెలుగు రాష్ట్రాలకు హ్యాండిచ్చారు. ఆయన గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు తెలుగు రాష్ట్రాలకు హ్యాండిచ్చారు. ఆయన గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారు. ఇరు రాష్ట్రాలు చేసిన అనేక ప్రతిపాదను ఆయన తుంగలో తొక్కారు. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ఇచ్చిన, చేసిన ప్రతిపాదనల్లో ఏ ఒక్కదాన్ని ఆయన పట్టించుకోలేదు. 
 
ముఖ్యంగా, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన సమయంలో ఇచ్చిన హామీని కూడా జైట్లీ మరిచిపోయినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో ఆయన పూర్తిగా నిర్లక్ష్యధోరణితో వ్యహరించారు. 
 
ఈ బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్థిక రంగ నిపుణులు స్పందిస్తూ, భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఉన్నాయా? అనే సందేహం ఈ బడ్జెట్ చూశాక కలుగుతోందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే అరుణ్ జైట్లీ తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపారంటూ వారు ఆరోపిస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పేలుతున్న సెటైర్లు... చూడండి వీడియోలో...