మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 జూన్ 2015 (18:09 IST)

భవన నిర్మాణ పునాదులలో శేషనాగును ఎందుకుంచుతారు?

పూర్తి భూమండలం శేషపడగపై సేదతీరుతుంది అనేది ప్రాచీన హైందవ సంప్రదాయం. అందుకే వెండి పడగ తయారు చేయించి, దానిలోకి శేషనాగుని స్ఫూర్తిని ఆపాదించి నూతన భవన నిర్మాణ పునాదులలో వుంచుతారు. శేషనాగు భూమండలాన్ని స్థిరంగా ఏ విధంగా పట్టివుంచుతాడో, పునాదిరాళ్ళు అదే మాదిరి భవన  భారాన్ని స్థిరంగా మోయాలన్న వాంఛతో ఇలా చేస్తారు.  
 
పాతాళలోకం భూమి కింద వుంది. ఈ పాతాళానికి అధిపతి నాగరాజు. కాబట్టి దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకోవడానికి పాముల్ని పూజిస్తారు. శేషనాగు క్షీరసాగరంలో కొలువై వుంటాడు కాబట్టి కలశంలో పాలు, పెరుగు, నెయ్యి వుంచి క్షీర సాగర ప్రతినిధిగా భావిస్తూ మంత్రాలు చదువుతారు. ఈ విష్ణు కలశంలో లక్ష్మీరూపు వుంచి కలశాన్ని భూమి లోపల పెడతారు. పునాది సందర్భంగా చేసే పూజలన్నీ ఈ నమ్మకాలతోనే సాగుతాయి.